ఆర్బీఐ బాండ్ల ఎంపిక సరైనదేనా?
పన్ను చెల్లించిన తర్వాత వచ్చే రాబడితో పన్ను రహిత బాండ్లను పోలిస్తే ఎంతవరకు లాభమో లెక్కించుకోవాలి....
పడిపోతున్న వడ్డీ రేట్లతో పాటు మార్కెట్ స్థిర ఆదాయ విభాగంలో రాబోయే డిఫాల్ట్లు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కొంతవరకు తగ్గించాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు సుమారు 6 శాతంగా ఉంది, దాని పైన పన్ను విధించబడుతుంది. పెట్టుబడిదారులకు, ప్రత్యేకించి అధిక ఆదాయ శ్లాబ్లో ఉన్నవారికి స్థిర-ఆదాయ పెట్టుబడి పన్ను రహిత బాండ్లు. కొన్ని పన్ను రహిత బాండ్లలో ప్రస్తుత రాబడి 5.5 శాతం ఉండగా, కొన్ని కంపెనీల ఎఫ్డిలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల స్థిర డిపాజిట్లు సుమారు 8 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆర్బిఐ పన్ను పరిధిలోకి వచ్చే బాండ్లు సంవత్సరానికి 7.75 శాతం, 7 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తున్నాయి. వాటితో పోలిస్తే, పన్ను రహిత బాండ్లు ఎంత వరకు ప్రయోజనకరం? తెలుసుకుందాం.
ఫండ్ పరిశ్రమ చాలా పటిష్ఠమైనది. దీనిపై రిటైల్ పెట్టుబడుదారులు ఆధారపడి ఉంటారు. అయితే ఇప్పుడు కొన్ని డెట్ ఫండ్లు లాక్ కావడం లేదా విలువను కోల్పోతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. అందువల్ల, డెట్ ఫండ్లు వారు పెట్టుబడులను సమీక్షించుకోవడం, ఇతర ఎక్కువ రాబడినిచ్చే పథకాలకు కేటాయించే అంశాలను పరిశీలించడం ఈ సమయంలో అవసరం .
ఆర్బీఐ బాండ్లు, పన్ను రహిత బాండ్లు అటువంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలలో ఒకటి, పెట్టుబడిదారులు వీటిలో పెట్టుబడులకు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్బీఐ బాండ్లు 7 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్తో ఉంటాయి. 7.75 శాతం రాబడి లభిస్తుంది. కానీ, ఇందులో ఎటువంటి పన్ను మినహాయింపు ఆప్షన్ ఉండదు.
అధిక వడ్డీ రేటు ఇచ్చినప్పటికీ ఎటువంటి పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉండదని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. దీంతో రాబడి ఎక్కువ ఉన్నప్పటికీ పన్ను చెల్లించిన తర్వాత తక్కువ వస్తుంది. లిక్విడిటీ అవసరం ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ కాకపోవచ్చు. కాలపరిమితి ఏడేళ్లు.
దీంతో పోలిస్తే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎక్కువ లాభం ఉంటుంది నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే , దీనిపై ఏడాది కాలపరిమితికి 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. లిక్విడిటీ అవసరం ఉన్నవారకి ఇది మంచి ఆప్షన్గా చెప్తున్నారు. ఆర్బీఐ బాండ్లు మధ్య-ఆదాయం వారికి అంటే కొంత డబ్బును దీర్ఘకాలం బ్యాంకు డిపాజిట్లలో ఉంచాలనుకునేవారికి ఇది సరిపోతుంది. ఉదాహరణకు 30 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు మరో పదేళ్ల పాటు వారి ఆదాయ నుంచి 10 శాతం డబ్బును బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనుకునేవారికి ఆర్బీఐ బాండ్లు సరైనవి.
ఐదేళ్ల హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6 శాతం. ఇందులో ఐదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు దానికి ప్రత్యామ్నాయంగా ఏడేళ్ల కాలపరిమితితో ఆర్బీఐ బాండ్లలో పెట్టవచ్చు. ఇవి సురక్షితంగా ఉంటాయి, అధిక రాబడిని ఇస్తాయి.
ఇక పన్ను రహిత (ట్యాక్స్-ఫ్రీ) బాండ్ల విషయానికొస్తే అవి 5.12 శాతం నుంచి 5.15 శాతం వరకు తక్కువ రాబడిని ఇచ్చినప్పటికీ పన్ను రహితంగా ఉంటాయి. ఈ బాండ్ల కాలపరిమితి సాధారణంగా పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు వారికి అనుకూలంగా మెచ్యూరిటీ గడువును ఎంచుకోవచ్చు.
హడ్కో, ఎన్హెచ్ఏఐ, ఆర్ఈసీ, ఎన్టీపీసీ, ఐఈర్ఎఫ్సీ, ఐఆర్ఈడీఏ, పీఎఫ్సీ, ఎన్హెచ్పీసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు ఈ బాండ్లను ఆఫర్ చేస్తున్నాయి. 30 శాతం కంటే ఎక్కువ పన్ను శ్లాబులోకి వచ్చేవారికి, అధిక పెట్టుబడులు, దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. రాబడిపై పన్ను ఉండదు, ఈక్విటీ పెట్టుబడుల మాదిరిగా రిస్క్ లేదు. పెట్టిన పెట్టుబడి అదేవిధంగా ఉంటుంది. కచ్చితమైన రాబడి ఉంటుంది. కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పటికీ లిక్విడిటీ కోసం ఎప్పుడైనా తీసుకోవచ్చు.
ఇవి ఎక్స్ఛేంజీలలో ట్రేడవుతాయి. 5.5 శాతం పన్ను రహిత రాబడి వస్తుంది. మెచ్యూరిటీపై కూడా పన్ను లేదు. పన్ను చెల్లించే పెట్టుబడుదారులు ఇప్పుడున్నరేట్ల ప్రకారం 6 శాతం వడ్డీతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పదేళ్ల తర్వాత పన్ను పోగా 4.13 శాతం రాబడి వస్తుంది. దీనికి బదులుగా పన్ను-రహిత బాండ్లలో పెట్టుబడులు ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ పన్ను-రహిత బాండ్ల ప్రారంభించడం వాటాదారులకు ఉపశమని కలిగిస్తుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు