SpiceJet: స్పైస్‌జెట్ గుడ్‌న్యూస్‌.. విమానంలో ఉంటూనే క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయం!

ప్రముఖ విమానయాన సంస్థ స్పై్స్‌జెట్‌ తమ ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం పరిచయం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగాక క్యాబ్‌ బుక్‌ చేసి వేచి చూసే బదులు.. ప్రయాణంలో ఉంటూనే గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలుగా క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Published : 12 Aug 2021 16:15 IST

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ తమ ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం పరిచయం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగాక క్యాబ్‌ బుక్‌ చేసి వేచి చూసే బదులు.. ప్రయాణంలో ఉంటూనే గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలుగా క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన ఆన్‌బోర్డ్‌ సర్వీస్‌ ‘స్పైస్‌స్క్రీన్‌’ ద్వారా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. తొలుత గురువారం (ఆగస్టు 12) దిల్లీలో ఈ సేవలు ప్రారంభించామని, దశలవారీగా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, గోవా, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె వంటి  ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించనున్నామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణ సమయాన్ని, వేచి చూసే సమయాన్ని తగ్గించడానికి ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలిపింది.

స్పైస్‌జెట్‌ గతేడాది ఆగస్టులో స్పైస్‌స్క్రీన్‌ ఆన్‌బోర్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ వైర్‌లెస్‌  నెట్‌వర్క్‌కు స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌తో కనెక్ట్‌ అవ్వొచ్చు. దీని ద్వారా క్యాబ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాక  మెసేజ్‌ లేదా వాట్సాప్ ద్వారా ఓటీపీ వస్తుంది. క్యాబ్‌ జర్నీ పూర్తయ్యాక చెల్లింపులు పూర్తిచేయొచ్చు. క్యాబ్‌ బుకింగ్‌కు సంబంధించి తమ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణంతో క్యాబ్‌ క్యాన్సిల్‌ అయినా ఎలాంటి క్యాన్సిలేషన్‌ ఛార్జీలూ పడబోవని స్పైస్‌జెట్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని