Whatsapp: డేటా నిబంధనల ఉల్లంఘన.. ఐర్లాండ్‌లో వాట్సాప్‌కు భారీ ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారీ జరిమానా పడింది. డేటా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఐర్లాండ్‌కు చెందిన డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ 225 మిలియన్‌ యూరోలను జరిమానాగా విధించింది.

Published : 02 Sep 2021 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారీ జరిమానా పడింది. డేటా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఐర్లాండ్‌కు చెందిన డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ 225 మిలియన్‌ యూరోలను జరిమానాగా విధించింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1950 కోట్లు అన్నమాట. వ్యక్తుల డేటాను ఇతర ఫేస్‌బుక్‌ కంపెనీలతో పంచుకునే విషయంలో పారదర్శకత పాటించకపోవడంతో ఈ జరిమానా వేసినట్లు డీపీసీ పేర్కొంది.

వాట్సాప్ వినియోగదారులకు వారి డేటా ఎలా ప్రాసెస్ చేస్తామో అన్న విషయాన్ని వారికి తెలియజేసేలా తగిన సమాచారం ఇవ్వకుండా  వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘించిందని డీపీసీ పేర్కొంది. ఈ అంశంపై 2018లో విచారణ ప్రారంభించి తాజాగా జరిమానా విధించింది. జరిమానాపై వాట్సాప్‌ స్పందించింది. భారీ స్థాయిలో జరిమానా వేయడాన్ని తప్పుబట్టింది. దీనిపై తాము అప్పీల్‌కు వెళతామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని