డిస్నీ+ హాట్‌స్టార్‌ పథకాల ధరల పెంపు: ఎయిర్‌టెల్‌

డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి వచ్చే మొబైల్‌ ప్రీపెయిడ్‌, ఇంటి బ్రాడ్‌బ్యాండ్‌ పథకాల ధరలు పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 28 రోజుల కాలవ్యవధి కలిగిన ప్రీపెయిడ్‌ మొబైల్‌ పథకాల ధరను రూ.448 నుంచి రూ.499; 56 రోజుల

Updated : 22 Aug 2022 16:36 IST

దిల్లీ: డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి వచ్చే మొబైల్‌ ప్రీపెయిడ్‌, ఇంటి బ్రాడ్‌బ్యాండ్‌ పథకాల ధరలు పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 28 రోజుల కాలవ్యవధి కలిగిన ప్రీపెయిడ్‌ మొబైల్‌ పథకాల ధరను రూ.448 నుంచి రూ.499; 56 రోజుల వ్యవధి ధరను రూ.599 నుంచి రూ.699; ఏడాది కాలవ్యవధి ప్యాక్‌ ధరను రూ.2698 నుంచి రూ.2798కు ఎయిర్‌టెల్‌ పెంచింది.


2026కు దేశీయ డ్రోన్‌ పరిశ్రమ రూ.15,000 కోట్లకు
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

దిల్లీ: భారత డ్రోన్‌ పరిశ్రమ 2026 నాటికి రూ.15,000 కోట్ల టర్నోవర్‌ సాధించే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంతో ఈ రంగానికి ఊతం లభిస్తుందని, గత నెలలో అమల్లోకి తెచ్చిన సరళీకృత నియమాలు కూడా ఈ రంగ వృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎల్‌ఐ పథకం కింద డ్రోన్లు, డ్రోన్‌ పరికరాల కోసం 3 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.120 కోట్లను కేంద్రం కేటాయించింది. డ్రోన్‌ పాలసీ (నియమావళి), డ్రోన్‌ పీఎల్‌ఐ పథకంతో డ్రోన్‌ తయారీ కంపెనీల టర్నోవర్‌ వచ్చే మూడేళ్లలో రూ.900 కోట్లకు చేరుతుందని సింధియా వివరించారు. ప్రస్తుతం ఈ కంపెనీల టర్నోవర్‌ సుమారు రూ.80 కోట్ల వరకు ఉందని తెలిపారు. డ్రోన్‌ పరిశ్రమలోని హార్డ్‌వేర్‌ (డ్రోన్‌ తయారీ సంస్థలు), సాఫ్ట్‌వేర్‌, సర్వీస్‌ డెలివరీ మొత్తం వాల్యూ చైన్‌ 2026 నాటికి 180 కోట్ల డాలర్లకు (రూ.12,000-15,000 కోట్లు) చేరుకుంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని