వరుసగా 12వ రోజు.. ఇంధన ధరలు పైకే!
దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు
దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ చమురు సంస్థలు శనివారం మరోసారి ఇంధన ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్పై 39పైసలు, డీజిల్పై 37 పైసలు పెంచాయి. కాగా ఇంధన ధరలు పెరగడం వరుసగా ఇది 12వ రోజు కావడం గమనార్హం. తాజాగా పెరిగిన ధరలతో దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90 మార్కును దాటింది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.90.58గా, డీజిల్ ధర రూ.80.97గా నమోదైంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.18, డీజిల్ ధర రూ.88.31గా నమోదైంది. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రో ధరల పెంపు తమ జీవితాలపై పెను భారం మోపుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగరం | పెట్రోల్ ధర లీటరుకు | డీజిల్ ధర లీటరుకు |
దిల్లీ | రూ.90.58 | రూ.80.97 |
ముంబయి | రూ.97.00 | రూ.88.06 |
హైదరాబాద్ | రూ.94.18 | రూ.88.31 |
బెంగళూరు | రూ.93.61 | రూ.85.84 |
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్