Future Group: మరో న్యాయపోరాటంలోఫ్యూచర్ గ్రూప్!
తమ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలను సవాల్ చేస్తూ కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గడువులోగా రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు తమపై ఎగవేతదారు ముద్ర వేయకుండా నిలువరించాలని కోరింది....
ఎగవేతదారుగా ప్రకటించొద్దని విజ్ఞప్తి
దిల్లీ: తమ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలను సవాల్ చేస్తూ కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గడువులోగా రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు తమని ఎగవేతదారుగా ప్రకటించడాన్ని నిలువరించాలని కోరింది. అమెజాన్తో న్యాయపోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో తమ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తమ రిటైల్ విభాగాన్ని రిలయన్స్కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో అమెజాన్తో చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో విక్రయం నిలిచిపోయింది. ఫలితంగా బాకీలను ఫ్యూచర్ సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో రుణదాతలు విధించిన కొన్ని నిబంధనలు ఉల్లఘించినట్లైంది. కానీ, ఫ్యూచర్ మాత్రం తమవైపు ఎటువంటి తప్పు జరగలేదని వాదిస్తోంది.
డిసెంబరు 31 నాటికి చెల్లించాల్సిన రూ.3,500 కోట్ల బకాయిల విషయంలో తాము విఫలమయ్యామని ఈనెల ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్ గ్రూప్ అంగీకరించింది. అమెజాన్తో తలెత్తిన వివాదం కారణంగా తాము కొన్ని విక్రయ ఒప్పందాలు అమలు చేయలేకపోయినట్లు తెలిపింది. అందుకే చెల్లింపులు సకాలంలో చేయలేకపోయామని వివరించింది. 30 రోజుల ‘గ్రేస్ పీరియడ్’లో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించామని తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తమకు మరికొంత సమయమిచ్చేలా రుణదాతలతో పాటు రిజర్వు బ్యాంకును ఆదేశించాలని ఫ్యూచర్ గ్రూప్ కోర్టును కోరింది. అలాగే ఎస్బీఐ సహా ఇతర సంస్థల నుంచి తమకు అందిన ఎగవేత నోటీసులను సైతం కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!