రూ.79,999కే ఓలా విద్యుత్తు స్కూటర్‌

ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ సరికొత్త ఎస్‌1 ఎయిర్‌ విద్యుత్తు స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభంలో రూ.79,999కే అందిస్తామని సంస్థ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ శనివారం చెప్పారు.

Published : 23 Oct 2022 03:01 IST

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ సరికొత్త ఎస్‌1 ఎయిర్‌ విద్యుత్తు స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభంలో రూ.79,999కే అందిస్తామని సంస్థ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ శనివారం చెప్పారు. 2.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌, 4.5 కేడబ్ల్యూ హబ్‌ మోటార్‌ అమర్చిన ఈ స్కూటర్‌ గరిష్ఠంగా 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందన్నారు. 4.3 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెప్పారు.
వచ్చే ఏడాది విద్యుత్తు మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తామని భవీశ్‌ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో తొలి విద్యుత్తు స్కూటర్లను ఆవిష్కరించిన సంస్థ, ఇప్పటివరకు లక్షకు పైగా వాహనాలను విక్రయించిందన్నారు. రోజుకు 1,000 స్కూటర్లను తయారు చేస్తున్నామని, ఈ సామర్థ్యం రాబోయే 6-8 నెలల్లో మరింత పెరుగుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని