బంగారం కొనేస్తున్నారు
దేశంలో బంగారానికి గిరాకీ మళ్లీ పెరుగుతోందని, జులై-సెప్టెంబరులో ఇది కొవిడ్ ముందు స్థాయికి చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది.
కొవిడ్ ముందు స్థాయికి గిరాకీ
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
ముంబయి
దేశంలో బంగారానికి గిరాకీ మళ్లీ పెరుగుతోందని, జులై-సెప్టెంబరులో ఇది కొవిడ్ ముందు స్థాయికి చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. పుత్తడిపై కొనుగోలుదార్ల నుంచి అంచనాలకు మించిన ఆసక్తి వ్యక్తమవుతోందని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈఓ సోమసుందరం పీఆర్ తెలిపారు. పండగల సీజన్కు తోడు బంగారం ధర తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రుణంపై కొనుగోలుకు అవకాశాలు పెరగడం వల్ల దక్షిణాది నగరాలు/పట్టణాల్లో ఆభరణాల కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డీరేట్లు పెరుగుతుండటం, రూపాయి బలహీన పడుతున్నందున, బంగారంపై ఆసక్తి కొనసాగుతుందనే భావిస్తున్నామన్నారు. నాలుగో త్రైమాసికంలో దీపావళి అమ్మకాలు బాగానే జరిగాయని, వివాహాది శుభకార్యాలు కూడా ముందున్నందున, ఏడాది మొత్తంమీద 750-800 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడుతుందనే అంచనాను వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి-సెప్టెంబరులో 559 టన్నుల బంగారం దేశంలోకి అధికారికంగా దిగుమతి అయ్యిందన్నారు. ‘2022 మూడో త్రైమాసికంలో పసిడి గిరాకీ ధోరణుల’పై డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం..
* జులై-సెప్టెంబరులో మొత్తం 191.7 టన్నుల పసిడికి దేశీయంగా గిరాకీ లభించింది. 2021 ఇదే కాల గిరాకీ 168 టన్నులతో పోలిస్తే, ఇది 14 శాతం అధికమని వెల్లడించింది.
* విలువ పరంగా చూస్తే.. ఇది రూ.71,330 కోట్ల నుంచి 19 శాతం అధికమై రూ.85,010 కోట్లకు చేరింది.
* ఆభరణాలకు గిరాకీ 125.1 టన్నుల నుంచి 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా ఇది రూ.53,330 కోట్ల నుంచి 22 శాతం అధికమై రూ.64,860 కోట్లకు చేరింది.
* పెట్టుబడులకు నిదర్శనంగా భావించే పసిడి నాణేలు, బిస్కెట్లకు గిరాకీ 42.9 టన్నుల నుంచి 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా ఇది రూ.18,300 కోట్ల నుంచి 10 శాతం అధికమై రూ.20,150 కోట్లకు చేరింది.
* పునర్వినియోగానికి చేరిన బంగారం 20.7 టన్నుల నుంచి 23 శాతం తగ్గి 16 టన్నులకు పరిమితమైంది.
* ఆర్బీఐ కూడా జులైలో 13, సెప్టెంబరులో 4 టన్నుల మేర కొనుగోలు చేయడంతో, మొత్తం పసిడి నిల్వలు 785 టన్నులకు చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా 1181.5 టన్నులు
ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు త్రైమాసికంలో 1181.5 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడింది. ఏడాది క్రితం ఇదే కాల గిరాకీ 921.9 టన్నులతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ పెట్టుబడులు 47 శాతం తగ్గితే, లోహంపై మాత్రం 36 శాతం పెరిగి 351.1 టన్నులకు చేరాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు 90.6 టన్నుల నుంచి 399.3 టన్నులకు చేరడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్