అంచనాల కంటే రూ.4 లక్షల కోట్ల అదనపు ఆదాయం
దేశంలో పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్ అంచనాల కంటే రూ.4 లక్షల కోట్లు పెరగొచ్చని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ బుధవారం వెల్లడించారు.
2022-23పై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్
దిల్లీ: దేశంలో పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్ అంచనాల కంటే రూ.4 లక్షల కోట్లు పెరగొచ్చని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ బుధవారం వెల్లడించారు. ఆదాయపు పన్నుతో పాటు దిగుమతి సుంకం, జీఎస్టీ వసూళ్లు పెరగడమే ఇందుకు కారణమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.27.50 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, దిగుమతి, ఎగుమతి సుంకాలు, వస్తు-సేవల పన్నులు కలిపి మరో రూ.14 లక్షల కోట్లు ఖజానాకు చేరతాయని తరుణ్ బజాజ్ వివరించారు. అంటే బడ్జెట్ అంచనాల కంటే రూ.4 లక్షల కోట్లు అదనంగా రాబోతున్నాయని తెలిపారు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లు, పరోక్ష పన్ను వసూళ్లు రూ.13.30 లక్షల కోట్లు కలిపి మొత్తంగా రూ.27.50 లక్షల కోట్ల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలోనూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యం కంటే సుమారు 50 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే అధిక పన్ను వసూళ్ల ధోరణి కొనసాగుతోందని బజాజ్ వెల్లడించారు. దిగుమతి, ఎగుమతి సుంకాలను ఇటీవల తగ్గించినప్పటికీ, బడ్జెట్లో విధించుకున్న రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( )
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు