తగ్గిన కరెంట్‌ ఖాతా లోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో మన దేశ కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) 10.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.87,000 కోట్ల)కు పరిమితమైంది.

Published : 27 Mar 2024 01:13 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో మన దేశ కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) 10.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.87,000 కోట్ల)కు పరిమితమైంది. ఇది జీడీపీలో 1.2 శాతానికి సమానమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. జులై-సెప్టెంబరులో సీఏడీ 11.4 బిలియన్‌ డాలర్లుగా, 2022-23 ఇదే కాలంలో 16.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అక్టోబరు- డిసెంబరులో విదేశీ మారకపు నిల్వలు 6 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో 11.1 బిలియన్‌ డాలర్లు వచ్చిచేరాయి. వస్తువుల వాణిజ్య లోటు 71.3 బిలియన్‌ డాలర్ల నుంచి 71.6 బి.డాలర్లకు పెరిగింది.

  • సేవల ఎగుమతులు 5.2% వృద్ధి చెందాయి. సాఫ్ట్‌వేర్‌, వ్యాపార, ప్రయాణ సేవలు ఇందుకు కలిసొచ్చాయి.
  • విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 12 బిలియన్‌ డాలర్లు రాగా, అంతక్రితం ఏడాది 4.6 బిలియన్‌ డాలర్ల తరలివచ్చాయి. ప్రవాస భారతీయుల డిపాజిట్లు 2.6 బి.డాలర్ల నుంచి 3.9 బి.డాలర్లకు పెరిగాయి.
  • 2023 ఏప్రిల్‌- డిసెంబరు కాలంలో భారత్‌లోకి 8.5 బిలియన్‌ డాలర్ల నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 2022 ఇదే సమయంలో ఇవి 21.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని