సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది.
పైపులు, ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి హెచ్ఐఎల్
క్రెస్టియా పాలీటెక్-అనుబంధ సంస్థల కొనుగోలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. దేశంలో ఈ వ్యాపార వార్షిక అమ్మకాలు రూ.55,000 కోట్ల స్థాయిలో ఉండగా, ఏటా ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తోంది. పైపులు, ఫిట్టింగ్స్ విభాగంలో పూర్తి శ్రేణి ఉత్పత్తులను అందించే నిమిత్తం క్రెస్టియా పాలీటెక్ అనే సంస్థను హెచ్ఐఎల్ సొంతం చేసుకుంది. దీనిపై రూ.265 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ కొనుగోలుతో క్రెస్టియా పాలీటెక్కు అనుబంధంగా ఉన్న టాప్లైన్ ఇండస్ట్రీస్, ఆదిత్య పాలీటెక్నిక్, ఆదిత్య ఇండస్ట్రీస్, సాయినాథ్ పాలీమర్స్తో పాటు ఈ సంస్థలకు చెందిన టాప్లైన్, రాక్వెల్, సోనిప్లాస్ట్ బ్రాండ్లు హెచ్ఐఎల్ చేతికి వస్తున్నాయి.
క్రెస్టియా పాలీటెక్కు తూర్పు భారతదేశంలో పైపులు, ఫిట్టింగ్స్, నీటి ట్యాంకుల వ్యాపారంలో అధిక మార్కెట్ వాటా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి క్రెస్టియా, దాని అనుబంధ సంస్థలు రూ.330 కోట్ల టర్నోవర్ నమోదు చేశాయి. తాజా లావాదేవీతో హెచ్డీపీఈ, ఎండీపీఈ ఉత్పత్తులు, నీటి ట్యాంకుల మార్కెట్లో హెచ్ఐఎల్ అడుగుపెట్టినట్లు అవుతుంది. ఈ విభాగంలో 2026 నాటికి టర్నోవర్ను 5 రెట్లు పెంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు హెచ్ఐఎల్ అధ్యక్షురాలు అవంతీ బిర్లా తెలిపారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లాభంలో 10 శాతం క్షీణత
దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.724 కోట్లకు పరిమితమైంది. కేటాయింపులు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమైంది. కిందటేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.803 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.7,822 కోట్ల నుంచి పెరిగి రూ.9,861 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) కూడా రూ.3,597 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ.4,469 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.51 శాతం నుంచి 1.88 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.86 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గాయి. అయితే కేటాయింపులు రూ.482 కోట్ల నుంచి 50 శాతం మేర పెరిగి రూ.722 కోట్లకు చేరాయి. 2023-24, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎటువంటి డివిడెండును ప్రకటించలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.82 శాతం నుంచి 16.11 శాతానికి తగ్గింది.
విస్తరణ బాటలో యాక్సెస్ మెడిటెక్
ఈనాడు, హైదరాబాద్: బీమా సంస్థలకు సాంకేతిక సేవలను అందించే ఇన్సూర్టెక్ సంస్థ యాక్సెస్ మెడిటెక్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. బీమా సంస్థలతోపాటు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు(టీపీఏ), బీమా సలహాదారులకూ అవసరమైన సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది. విస్తరణలో భాగంగా కొత్త మార్కెట్లలో తమ ఉత్పత్తులను పరిచయం చేయబోతున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్ ఐజాజుద్దీన్ పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధితోపాటు బీమా రంగంలోని సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 130 మంది ఉద్యోగులున్నారని, కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ఈ ఏడాది చివరి నాటికి మరో 50 మంది వరకూ నియమించుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సౌదీ అరేబియా, దుబాయ్లలో కార్యాలయాలు ఉన్నాయని, 2025 నాటికి ఐరోపాలో అడుగుపెడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( )
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు