పీవీఆర్ నష్టం రూ.220 కోట్లు
దిగ్గజ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ను కొవిడ్ మహమ్మారి దారుణంగా దెబ్బ తీసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఈ సంస్థ రూ.219.55 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ
దిల్లీ: దిగ్గజ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ను కొవిడ్ మహమ్మారి దారుణంగా దెబ్బ తీసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఈ సంస్థ రూ.219.55 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.225.73 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.12.70 కోట్ల నుంచి రూ.59.39 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.417.06 కోట్లుగా నమోదయ్యాయి. దేశంలో కొవిడ్-19 తీవ్రత తగ్గి, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభించనున్నామని కంపెనీ తెలిపింది. 2021 జులై 29 నాటికి దేశంలోని 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, కొలంబో, శ్రీలంక కొన్ని పరిమితులతో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాయి. ఈ ప్రాంతాల్లో 526 తెరలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల రుణం పొందినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు