అమెరికా షేల్ వెంచర్ నుంచి ఆయిల్ ఇండియా బయటకు
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా, అమెరికా షేల్ ఆయిల్ వెంచర్ నుంచి బయటకొచ్చేసింది. ఆ సంస్థలో ఉన్న 20 శాతం వాటాను 2.5 కోట్ల డాలర్లకు (సుమారు రూ.187 కోట్లు) విక్రయించింది. యూఎస్
2.5 కోట్ల డాలర్లకు 20% వాటా విక్రయం
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా, అమెరికా షేల్ ఆయిల్ వెంచర్ నుంచి బయటకొచ్చేసింది. ఆ సంస్థలో ఉన్న 20 శాతం వాటాను 2.5 కోట్ల డాలర్లకు (సుమారు రూ.187 కోట్లు) విక్రయించింది. యూఎస్ షేల్ వ్యాపారం ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ వైదొలగ్గా, ఇప్పుడు ఆయిల్ కూడా వచ్చేసింది. ఆయిల్ ఇండియా (యూఎస్ఏ) ఇంక్ (ఆయిల్ ఇండియా పూర్తిస్థాయి అనుబంధ సంస్థ) నియోబ్రారా షేల్ అసెట్, యూఎస్ఏలో మొత్తం వాటాను ఉపసంహరించుకున్నట్లు నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కలిసి 2012 అక్టోబరులో హ్యూస్టన్ కేంద్రంగా నడుస్తున్న కార్రిజో ఆయిల్ అండ్ గ్యాస్ నియోబ్రారా షేల్ అసెట్లో 8.25 కోట్ల డాలర్లతో 30 శాతం వాటా కొనుగోలు చేశాయి. తమ అనుబంధ సంస్థల ద్వారా ఆయిల్ ఇండియా 20 శాతం, ఐఓసీ 10 శాతం వాటా దక్కించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక