టాటా సఫారీ ‘డార్క్’ ఎడిషన్
టాటా మోటార్స్ తన ప్రీమియం ఎస్యూవీ సఫారీలో ‘డార్క్’ ఎడిషన్ను సోమవారం ఆవిష్కరించింది. ఈ వాహన ధరను రూ.19.05 లక్షలు(ఎక్స్ షోరూం-దిల్లీ)గా నిర్ణయించారు.
దిల్లీ: టాటా మోటార్స్ తన ప్రీమియం ఎస్యూవీ సఫారీలో ‘డార్క్’ ఎడిషన్ను సోమవారం ఆవిష్కరించింది. ఈ వాహన ధరను రూ.19.05 లక్షలు(ఎక్స్ షోరూం-దిల్లీ)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా డీలర్షిప్లలో ఈ డార్క్ ఎడిషన్ను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎక్స్టీ+/ఎక్స్టీఏ+, ఎక్స్జడ్+/ఎక్స్జడ్ఏ+ ట్రిమ్స్లలో లభించే డార్క్లో తొలి, రెండో వరుసలోనూ వెంటిలేటెడ్ సీట్లు; ఎయిర్ ప్యూరిఫయర్, వైఫై ద్వారా ఆండ్రాయ్డ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ప్రత్యేక ఫీచర్లను పొందొచ్చు. ‘హారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్ను తీసుకొస్తే మంచి గిరాకీ దక్కింది. సఫారీకి అప్గ్రేడ్ కావడానికి తాజా డార్క్ ఎడిషన్ కూడా ఒక కారణంగా నిలుస్తుంద’ని కంపెనీ ప్యాసింజర్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్(విక్రయాలు, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్) రాజన్ అంబా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్