దొడ్ల డెయిరీ చేతికి శ్రీ కృష్ణ మిల్క్స్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దొడ్ల డెయిరీ, కర్నాటకలోని శ్రీ కృష్ణ మిల్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. దీనిపై కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు దొడ్ల డెయిరీ శనివారం

Updated : 20 Mar 2022 03:06 IST

లావాదేవీ విలువ రూ.50 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దొడ్ల డెయిరీ, కర్నాటకలోని శ్రీ కృష్ణ మిల్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. దీనిపై కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు దొడ్ల డెయిరీ శనివారం వెల్లడించింది. రూ.50 కోట్ల విలువకు ఈ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే రెండు నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందని తెలిపింది. శ్రీ కృష్ణ మిల్క్స్‌ 1989లో ఏర్పాటైంది. కర్నాటకలో ఇదే తొలి ప్రైవేటు డెయిరీ సంస్థ కావటం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.67 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.76 కోట్ల టర్నోవర్‌ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని