Hero Xoom 110: హీరో మోటోకార్ప్ నుంచి జూమ్.. ప్రారంభ ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) మరో కొత్త స్కూటర్ని లాంచ్ చేసింది. ఫిబ్రవరి నుంచి బుకింగ్లు చేసుకోవచ్చని తెలిపింది.
దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) హీరో జూమ్ 110 పేరిట కొత్త స్కూటర్ను సోమవారం లాంచ్ చేసింది. LX, VX, ZX మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ను తీసుకొస్తోంది. వీటిలో ఎల్ఎక్స్ ధర రూ.68,599 (ఎక్స్షోరూం), వీఎక్స్ ధర రూ.71,799 (ఎక్స్షోరూం), జెడ్ఎక్స్ ధర రూ. 76,699 (ఎక్స్షోరూం)గా నిర్ణయించింది. ఫిబ్రవరి నుంచి బుకింగ్లు ప్రారంభం కానున్నాయని హీరోమోటోకార్ప్ వెల్లడించింది.
ఇక ఈ స్కూటర్ ప్రత్యేకతలు చూస్తే.. బ్లూటూట్ కనెక్టివిటీ, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి. 110సీసీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్ ఇంజిన్ 7250 ఆర్ఎంపీ వద్ద 8బీహెచ్పీని, 5750 ఆర్ఎంపీ వద్ద 8.7ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ ఐ3ఎస్ టెక్నాలజీతో వస్తోంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. నారింజ, నలుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక హంగులతో ఈ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. H-షేప్డ్ LED DRLs,ఎక్స్ షేప్డ్ టెయిల్ ల్యాంప్లతో ఈ స్కూటర్కు కొత్త హంగులు జోడించారు. దీనికి కార్నరింగ్ లైట్లను కూడా ఇచ్చారు. ఇందులో ప్రత్యేకంగా 12 అంగుళాలు కలిగిన అలాయ్వీల్స్.. ఇది 1300mm వీల్బేస్, 1843mm పొడవు, 717 mm వెడల్పు, 1188 mm ఎత్తు ఉంది. X వేరియంట్కు మాత్రం 731 mm కలిగిన వెడల్పయిన బాడీని ఇచ్చారు. ఇక ఇంజన్ విషయానికొస్తే 110 సీసీ.. సింగల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు