Section 80C: సెక్షన్ 80C లిమిట్ పెంచుతారా? ప్రభుత్వ సమాధానం ఇదే..
Income tax 80C limit: సెక్షన్ 80సి లిమిట్ పెంచాలని ట్యాక్స్పేయర్లు కోరుతున్నారు. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను చట్టం (Income Tax)లోని సెక్షన్ 80C (Section 80C) లిమిట్ పెంచాలని వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద 80C రూపంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపులు పొందేందుకు వీలుంది. ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందా? అని పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని పేర్కొంది.
పన్ను చెల్లింపును సులభతరం చేసే ఉద్దేశంతో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అందుకే మినహాయింపులు తొలగించి, తక్కువ పన్ను రేట్లు ఉన్న కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కాబట్టి సెక్షన్ 80C లిమిట్నను పెంచే ఉద్దేశమేదీ లేదని స్పష్టంచేశారు. అలాగే, చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో రూ.74,937 కోట్లు సమకూరినట్లు మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
హార్లే ప్రియులకు హీరో షాక్.. X440 ధర పెంపు
సెక్షన్ 80C కింద గృహ రుణాలు, జీవిత బీమా పాలసీలతో పాటు పీపీఎఫ్, ఈపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చేసే 5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ పెట్టుబడుల పరిమితి రూ.1.50 లక్షలు దాటినా రూ.1.5 లక్షల వరకే మినహాయింపులకు అనుమతిస్తారు. అందుకే ఈ పరిమితిని పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్కు ముందు నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లోనూ పలువురు 80సి పరిమితి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM