Auto Sales: సెప్టెంబరులోనూ వాహన విక్రయాలకు చిప్ సెగ!
సెప్టెంబరులోనూ వాహన విక్రయాలకు చిప్సెట్ల కొరత వేధించింది. కొన్ని కంపెనీలు రాణించినప్పటికీ.. కీలక సంస్థల విక్రయాలు మాత్రం పడిపోయాయి....
దిల్లీ: సెప్టెంబరులోనూ వాహన విక్రయాలకు చిప్సెట్ల కొరత వేధించింది. కొన్ని కంపెనీలు రాణించినప్పటికీ.. కీలక సంస్థల విక్రయాలు మాత్రం పడిపోయాయి. దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్ఐ) వాహన విక్రయాల్లో 46% క్షీణత కనిపించింది. గత నెలలో అమ్మకాలు 86,380 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 సెప్టెంబరులో సంస్థ 1,60,442 వాహనాలు విక్రయించింది. ఎంఎస్ఐ దేశీయ విక్రయాలు 1,60,442 నుంచి ఏకంగా 54.9 శాతం తగ్గి 68,815కి పరిమితమయ్యాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్-ప్రెసోల విక్రయాలు 68,815 నుంచి 68,815కు పడిపోయాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ విక్రయాలు 75.19 శాతం తగ్గి 20,891కి తగ్గిపోయాయి. మధ్యస్థాయి సెడాన్ సియాజ్ అమ్మకాలు 36.04 శాతం పడిపోయాయి. వినియోగ వాహనాలైన ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజా, విక్రయాలు 22.11 శాతం తగ్గి 18,459కు చేరాయి. అయితే, ఎగుమతులు మాత్రం రెండింతలు పెరగడం విశేషం. గత ఏడాది ఇదే నెలలో 7,834 యూనిట్లు ఎగుమతి కాగా.. ఈసారి అవి 17,565 యూనిట్లకు పెరిగింది.
* ఇక మరో వాహన దిగ్గజం హ్యుందాయ్ అమ్మకాలు సైతం 59,913 నుంచి 24 శాతం తగ్గి 45,791 యూనిట్లకు పడిపోయాయి. టొయోటా కిర్లోస్కర్, నిస్సాన్, ఎంజీ మోటార్, స్కోడా ఆటో విక్రయాలు మాత్రం సెప్టెంబరు నెలలో పెరిగాయి.
* ద్విచక్ర వాహనాల్లో బజాజ్ ఆటో విక్రయాలు 16 శాతం తగ్గాయి. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు సైతం 06 శాతం పెరిగాయి.
కంపెనీ 2021 2020 వృద్ధి/క్షీణత(%)
మారుతీ సుజుకీ 86,380 1,60,442 46.16
టొయోటా 9,284 8,116 14
నిస్సాన్ 2,816 780 361
ఎంజీ మోటార్ 3,241 2,537 28
స్కోడా ఆటో 3,027 1,312 230
హ్యుందాయ్ 45,791 59,913 23.6
మహీంద్రా 28,112 35,920 21.73
ట్రాక్టర్లు..
ఎస్కార్ట్స్ 8,816 11,851 25.6
మహీంద్రా 40,331 43,386 07
ద్విచక్రవాహనాలు..
బజాజ్ ఆటో 1,92,348 2,28,731 16
టీవీఎస్ మోటార్ 3,32,511 3,13,332 06
వాణిజ్య వాహనాలు...
వీఈసీవీ 6,070 3,506 73.1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్