యమహా మాన్‌స్టర్‌ ఎనర్జీ MotoGP స్పెషల్‌ ఎడిషన్‌ టూ-వీలర్స్‌ లాంచ్‌

భారత్‌లో ‘యమహా’ మూడు  మాన్‌స్టర్‌ ఎనర్జీ MotoGP స్పెషల్‌ ఎడిషన్‌ టూ-వీలర్లను విడుదల చేసింది.

Published : 13 Sep 2023 17:48 IST

దిల్లీ: యమహా ఇండియా.. భారత్‌లో మూడు యమహా మాన్‌స్టర్‌ ఎనర్జీ MotoGP స్పెషల్‌ ఎడిషన్‌ టూ-వీలర్లను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ద్విచక్ర వాహనాలు పరిమిత యూనిట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సెప్టెంబరు 3వ వారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ ప్రీమియం బ్లూ స్క్వేర్‌ అవుట్‌లెట్లలో వీటిని కొనుగోలు చేయొచ్చు. మోడళ్లలో YZF-R15M, MT-15 V2.0, Ray ZR 125 Fi హైబ్రిడ్‌ మోడళ్లు ఉన్నాయి. యమహా మాక్సీ-స్పోర్ట్స్‌ స్కూటర్‌ Aerox 155 ప్రత్యేక మోటోజీపీ ఎడిషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. యమహా YZF-R15M ధర రూ.1,97,200 (ఎక్స్‌-షోరూం), MT-15 V2.0 ధర రూ.1,72,700 (ఎక్స్‌-షోరూం), Ray ZR 125 Fi హైబ్రిడ్‌ ధర రూ.92,330 (ఎక్స్‌-షోరూం)గా కంపెనీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని