Samsung: దేశీయంగా ల్యాప్టాప్ల తయారీ.. ఈ ఏడాది నుంచే!
ఈ ఏడాది నుంచే దేశీయంగా ల్యాప్టాప్ల తయారీని ప్రారంభించనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది.
గురుగ్రామ్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) ఈ ఏడాది నుంచి భారత్లో ల్యాప్టాప్లు తయారుచేయనుంది. సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు సోమవారం ఈవిషయాన్ని వెల్లడించారు. నోయిడాలోని తయారీ యూనిట్లో వీటి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘‘శాంసంగ్ సంస్థకు భారత్లోని తయారీ కేంద్రాలు ఎంతో కీలకమైనవి. సంస్థ ప్లాంట్లలో నోయిడా యూనిట్ రెండో అతి పెద్దది. దీని ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎంతగానో సహకరించాయి. ఈ ఏడాది నుంచే ఇందులో ల్యాప్టాప్ల తయారీ ప్రారంభిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రపంచ స్థాయి డిమాండ్కు తగినట్లు ఉత్పత్తుల తయారీకి ప్లాంట్లో కొన్ని మార్పులు చేస్తాం’’ అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ టీఎమ్ రోహ్ తెలిపారు.
తాత్కాలిక బడ్జెట్పైనా ఆశలు ఇందుకే.. గత అనుభవాలివీ..!
ఇప్పటికే నోయిడా ప్లాంట్లో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ట్యాబ్లెట్లను సంస్థ తయారుచేస్తోంది. ఇటీవల కొత్తగా మార్కెట్లోకి విడుదలైన గెలాక్సీ ఎస్24 మోడల్ను ఇక్కడ తయారుచేస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. విదేశాల నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై గతేడాది కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్మార్ట్ఫోన్ తరహాలోనే వాటి తయారీని దేశీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో విక్రయించే ల్యాప్టాప్ బ్రాండ్లలో చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. దీంతో ఆయా సంస్థలు భారత్లోనే తయారీ ప్రారంభించాలని నిర్ణయించాయి. దేశీయంగా మొబైల్ తయారీ యూనిట్లు ఉన్న సంస్థలు వాటిలో ల్యాప్టాప్లు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన సంస్థలు కొత్తగా ప్లాంట్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM