Stock Market Update: వరుసగా రెండోరోజూ సూచీలకు లాభాలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. కమొడిటీ ధరలు తగ్గడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు అమెరికాలో బాండ్ల రాబడులు తగ్గడం, చమురు ధరలు ఇటీవలి గరిష్ఠాల నుంచి దిగిరావడం సూచీల సెంటిమెంటును పెంచింది. ఆసియా-పసిఫిక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడుతున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 52,654.24 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 52,909.87 - 52,447.25 మధ్య కదలాడింది. చివరకు 462.26 పాయింట్ల లాభంతో 52,727.98 వద్ద ముగిసింది. 15,657.40 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 142.60 పాయింట్లు లాభపడి 15,699.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,749.25 - 15,619.45 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.78.31 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర సంగతులు..
* 2023 ఆర్థిక సంవత్సరంలో రుణాల ద్వారా రూ.9,000 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 2.23 శాతం పెరిగింది.
* థామస్ కుక్ షేరు ధర ఈరోజు ఏకంగా 8.50 శాతం పెరిగి రూ.61.25కు స్థిరపడింది. ప్రమోటర్లు తమ వాటా పెంచుకోనున్నారనే వార్తలే అందుకు కారణం.
* వచ్చే మూడేళ్లలో రేమండ్స్ను రుణరహిత కంపెనీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 5 శాతం పెరిగాయి.
* రూట్ మొబైల్ షేర్లు ఈరోజు 8.04 శాతం లాభపడ్డాయి. షేర్ల బైబ్యాక్ నిమిత్తం ఈ కంపెనీ బోర్డు జూన్ 28న భేటీ కానుండడమే ఇందుకు కారణం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Munugode: కూసుకుంట్లకు మునుగోడు టికెట్ ఇస్తే ఓడిస్తాం: తెరాస అసమ్మతి నేతలు
-
Crime News
Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
-
Movies News
Ashwini Dutt: ఆ సినిమా చేసి నేనూ అరవింద్ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్
-
Politics News
Munugode: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగనుంది: రాజగోపాల్రెడ్డి
-
India News
రత్న భాండాగారం తెరవాలి.. పూరీ ఆలయ యంత్రాంగానికి పురావస్తు శాఖ లేఖ
-
India News
Yamuna River: ప్రమాదకర స్థాయిలో యమునా నది ప్రవాహం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
- Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
- Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్సింగ్ ఇంటికి పోలీసులు!
- Kalapuram: పవన్ కల్యాణ్ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్