TCS: వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. అందుకే..!: టీసీఎస్ సీఈఓ
TCS CEO on work frome office: ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడానికి గల కారణాన్ని వివరించారు టీసీఎస్ సీఈఓ. పని సంస్కృతి అలవడాలంటే ఉద్యోగులు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు.
TCS | ఇంటర్నెట్ డెస్క్: కరోనా సమయంలో వర్క్ఫ్రమ్ సంస్కృతికి వేగంగా మళ్లిన టెక్ కంపెనీలు.. ఇప్పుడు మళ్లీ కార్యాలయాలకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను వారానికి మూడు రోజులు రావాలంటుండగా.. ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) మాత్రం మునుపటిలా పూర్తిగా కార్యాలయాల నుంచే పనిచేయాలని సూచిస్తోంది. ఈ విషయంలో ఉద్యోగులకు ఇప్పటికే డెడ్లైన్ ఇచ్చింది. దీని వెనుక కారణాన్ని కంపెనీ సీఈఓ కృతి వాసన్ తాజాగా వివరించారు. ఇటీవల నాస్కామ్ నిర్వహించిన ఓ ఈవెంట్లో దీనిపై ఆయన మాట్లాడారు.
రిమోట్ వర్క్ సంస్కృతికి పూర్తిగా చరమగీతం పాడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని కృతి వాసన్ వివరించారు. ఎప్పటిలానే కార్యాలయాల నుంచి ఉద్యోగులు పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. తోటి ఉద్యోగులను అనుసరించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. ఇది రిమోట్ వర్క్తో ఎంతమాత్రం సాధ్యపడదన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్ వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సంస్థకూ నష్టదాయకమని పేర్కొన్నారు.
‘ఆఫీసుకు రాకుంటే చర్యలు’.. ఉద్యోగులకు TCS ఆఖరి ఛాన్స్!
విలువలకు టీసీఎస్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కృతి వాసన్ పేర్కొన్నారు. టీమ్ వర్క్తోనే అలాంటివి అందిపుచ్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. ఆన్లైన్ లేదా వర్చువల్ మీటింగ్ల ద్వారా అలాంటివి నేర్చుకోవడం సాధ్యమవ్వదన్నారు. కరోనా సమయంలోనే 30-40 శాతం మంది అసోసియేట్లు తమ కంపెనీలో చేరారని చెప్పారు. అలాంటి వారు కార్యాలయాలకు రాకుండా విధులు నిర్వహిస్తే.. విలువలు, పని సంస్కృతి అలవర్చుకోవడం సాధ్యం కాదని చెప్పారు. సంప్రదాయ పని విధానాన్నే టీసీఎస్ విశ్వసిస్తుందని, తమ క్లయింట్లు కూడా ఇదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు నియామకాల గురించి కూడా మాట్లాడారు. గిరాకీ పరిస్థితులకు తగ్గట్లుగా నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియామకాలను కొనసాగిస్తామని, భర్తీ వేగంలో మాత్రం మార్పు ఉండే అవకాశం ఉందని తెలిపారు. జెనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ ఏఐ) విభాగంలో అపార అవకాశాలు ఉన్నందున.. ప్రతి ఒక్కరికి దీని అవసరం ఉంటుందన్నారు. అయితే మానవుల విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని ఏ సాంకేతికతతోనూ భర్తీ చేయలేమని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు