Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్!
Aadhaar Update: మార్చి 15 నుంచి ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
దిల్లీ: ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు దగ్గర పడింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) మార్చి 15 నుంచి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ రేపటి (2023, జూన్ 14)తో ముగియనుంది. గడువు ముగిశాక డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు (Free Aadhaar Update) ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.
అప్డేట్ చేసుకోండిలా..
- https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
- ‘ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
- దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్పై క్లిక్ చేయాలి.
- తర్వాత కనిపించే డ్రాప్డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
- ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- 14 అంకెల ‘అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!