crime news: అసలే మద్య నిషేధిత రాష్ట్రం.. ఆపై ఎక్సైజ్ స్టేషన్లో ఖైదీలతో పోలీసుల మందుపార్టీ..!
మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్లో పోలీసులు-ఖైదీలు మందుపార్టీ చేసుకొన్నారు. అది కూడా ఎక్సైజ్ స్టేషన్ వేదికగా.
ఇంటర్నెట్డెస్క్: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్లో ఏకంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మందు పార్టీ జరిగింది. అది కూడా పోలీసులు-ఖైదీలు కలిసి చేసుకొన్నారు. ఈ ఘటన పట్నా జిల్లాలోని పాలిగంజ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. వాస్తవానికి బిహార్లో మద్య నిషేధం అమల్లో ఉండటంతో ఏకంగా ఎక్సైజ్ స్టేషన్లోకి మద్యం ఎలా వచ్చిందో అర్థంకావడంలేదు. సిబ్బంది గానీ, ఖైదీలకు సంబంధించిన వ్యక్తులు గానీ స్టేషన్లోకి మద్యం తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఎక్సైజ్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. వారి వద్దకు ఆ రోజు రాత్రి మద్యం చేరింది. దీంతో వారు పార్టీ చేసుకోవడం మొదలుపెట్టారు. వీరిలో ఒక ఖైదీ వీడియో తీసి తన కుటుంబసభ్యులకు పంపాడు. తనకు పోలీస్ కస్టడీలో ఎటువంటి ఇబ్బంది లేదని వారికి తెలిపాడు. అయితే.. ఈ వీడియోలో సియారామ్ మండల్, ఛోటే లాల్ మండల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఖైదీలతో కలిసి ఉన్నట్లు కనిపించడం కలకలం రేపింది. ఆ వీడియో వైరల్గా మారి.. పట్నాలోని సీనియర్ అధికారుల వద్దకు చేరింది. చివరికి పాలిగంజ్ పోలీసుల దృష్టికి కూడా రావడంతో హుటాహుటిన ఎక్సైజ్ స్టేషన్కు చేరుకొని పార్టీని ఆపారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఖైదీలు లాకప్లోనే ఉన్నారు.
‘ఖైదీలు మద్యం పార్టీ చేసుకుంటున్న వీడియో మా దృష్టికి వచ్చింది. వెంటనే మేము ఎక్సైజ్ స్టేషన్పై రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకొన్నాం. వారికి మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నాం’ సబ్ డివిజనల్ అధికారి అవదేష్ దీక్షిత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.