Gold Smuggling: ఎక్స్ప్రెస్ హైవేపై స్మగ్లర్లను ఛేజ్ చేసి.. 77 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
విమానాశ్రయం నుంచి ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకెళ్తున్న స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకొన్నారు. అనంతరం వారి నుంచి దాదాపు 9కిలోల బరువున్న 77 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. .....
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి లఖ్నవూకు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. విమానాశ్రయం నుంచి ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకెళ్తున్న స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకొన్నారు. అనంతరం వారి నుంచి దాదాపు 9కిలోల బరువున్న 77 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరం నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్రమంగా బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది. ఆ బిస్కెట్లను లఖ్నవూలోని చౌదరి చరణ్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వారు ముజఫర్నగర్ వెళ్లే వ్యక్తులకు అందించనున్నట్టు తెలిసింది.
దీంతో అప్రమత్తమైన లఖ్నవూ డీఆర్ఐ అధికారులు అనుమానితులు విమానాశ్రయంలో అడుగు పెట్టగానే వారిపై నిఘా ఉంచారు. ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్వేపై రెండు ఎస్యూవీలు హైస్పీడ్తో వెళ్తుండగా.. ఆ వాహనాలను ఛేజ్ చేసి అడ్డగించారు. రియాద్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు ఈ బిస్కెట్లను వారి నుంచి అందుకొనేందుకు వచ్చిన వ్యక్తులు వాహనాల్లో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి బెల్టులు, లోదుస్తుల్లో దాచి ఉంచిన మొత్తం 77 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపి ప్రధాన సూత్రధారిని లఖ్నవూలో అరెస్టు చేసినట్టు తెలిపారు. విమానాశ్రయం ద్వారా స్మగ్లర్లకు బంగారం అందించడంలో సహకరించిన కస్టమ్స్ అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం