అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన

Updated : 06 Sep 2020 10:12 IST

సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ. 

విచారణకు ఆదేశించిన మంత్రి..

లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమించారు. దేవాదాయశాఖ అధికారులు.. పోలీసు అధికారులతో కలిసి విచారణ చేపట్టాలని సూచించారు. రథం పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని