బాలుడిని కాపాడేందుకు వెళ్లి.. బావిలో పడ్డ 40మంది
మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 19 మందిని కాపాడారు. గంజ్బసోడ గ్రామంలో గురువారం
నలుగురు మృతి.. పలువురికి గాయాలు
విదిశ: మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలుడిని రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 19 మందిని కాపాడారు. గంజ్బసోడ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గంజ్బసోడ గ్రామంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల వరకు నీరుంది. బాలుడు పడిపోయిన విషయం తెలియగానే కొంతమంది స్థానికులు బావిలోకి దిగి రక్షించే ప్రయత్నం చేశారు. మరికొందరు బావి గోడ దగ్గర నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బావి గోడ కూలిపోయింది. దీంతో వారంతా బావిలో పడిపోయారు.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అదే సమయంలో బావి పక్కన ప్రాంతం కుంగడంతో సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ ట్రాక్టర్ కూడా బావిలోకి జారిపడింది. అందులో నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. మొత్తం 40 మందికి పైగా బావిలో పడినట్లు తెలిసింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. 19 మందిని బావి నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
సీఎం రూ.5లక్షల నష్టపరిహారం..
ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు సీఎం ట్విటర్ వేదికగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.