దారుణం.. తోటి బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై కాల్పులు: ఐదుగురి మృతి

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ శిబిరంలో దారుణం చోటుచేసుకుంది. 

Updated : 06 Mar 2022 16:04 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ శిబిరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ జవాను.. తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్‌తో సహా మొత్తం ఐదుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. అమృత్‌సర్‌ ఖాసా గ్రామంలో ఉన్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

‘అమృత్‌సర్‌ ఖాసా శిబిరంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ సత్తెప్ప తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో మొత్తం  ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో జవాను ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాం’ అని సైనిక ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని