DRDO scientist: పాక్ మహిళకు ఆకర్షితులై.. క్షిపణి రహస్యాలు చెప్పిన డీఆర్డీవో శాస్త్రవేత్త
పాక్ వలపువలలో చిక్కుకున్న ఓ డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO scientist) దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని చేరవేశాడు. మహిళ మాటలకు ఆకర్షితుడై క్షిపణి వివరాలను పంచుకున్నాడు.
పుణె: భారత రక్షణ రంగానికి (Defence Sector) చెందిన అత్యంత రహస్యమైన క్షిపణి (Indian missile systems) సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan)కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO scientist) ప్రదీప్ కురుల్కర్ (Pradeep Kurulkar) ఇటీవల అరెస్టయ్యారు. ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ నిఘా ఏజెంట్ వలపు వలలో పడిన ఆయన.. ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఛార్జ్షీట్లో ఉన్న వివరాల ప్రకారం..
ప్రదీప్ కురుల్కర్.. మహారాష్ట్ర (Maharashtra)లోని పుణెలో గల రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ల్యాబ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు గతేడాది ‘జారా దాస్గుప్తా’ పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తానో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని యూకేలో పనిచేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆయనకు అశ్లీల వీడియోలు, మెసేజ్లు పంపి ప్రదీప్తో స్నేహం పెంచుకుంది. వీరిద్దరూ వాట్సాప్లో వాయిస్, వీడియో కాల్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆకర్షితుడైన ప్రదీప్.. భారత క్షిపణి వ్యవస్థకు చెందిన అత్యంత రహస్య సమాచారం, రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
- ఇది చదివారా: సీఐ స్వర్ణలత కేసులో.. ‘సినిమా’ను మించిన ట్విస్టులు
డ్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్, అగ్ని మిసైల్ లాంఛర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిగేడింగ్ సిస్టమ్ వంటి పలు రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి వీరిద్దరూ చాటింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తన వ్యక్తిగత ఫోన్లో ఉన్న సమాచారాన్ని ప్రదీప్ ఆమెకు పంపినట్లు తెలిసింది. 2022 జూన్ నుంచి డిసెంబరు మధ్య వీరిద్దరూ చాటింగ్ చేసుకున్నట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆయన కార్యకలాపాలపై అనుమానం రావడంతో డీఆర్డీఓ (DRDO) అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ విషయం తెలియగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్.. జారా నంబరును బ్లాక్ చేసినట్లు తెలిసింది.
అధికారిక షెడ్యూళ్లు, లొకేషన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిసినా ప్రదీప్.. ఆ విషయాలను జారాతో చెప్పినట్లు ఏటీఎస్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఐపీ అడ్రసు ద్వారా ఆమె నంబరును ట్రేస్ చేయగా.. పాకిస్థాన్ నుంచి చాట్ చేసినట్లు తెలిసింది. ఆమె పాక్ నిఘా సంస్థ (Pakistani Intelligence Operative)కు చెందిన ఏజెంట్గా గుర్తించిన అధికారులు.. ఈ ఏడాది మే 3వ తేదీన ప్రదీప్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.