Crime News: గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 16 Dec 2021 01:21 IST

హైదరాబాద్‌: గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సంపత్ కిరణ్ కుమార్‌ను అరెస్టు చేసి.. 1.5 కిలోల గంజాయి నూనెను స్వాధీనం చేసుకున్నారు. పాడేరులోని డీలర్ల సహాయంతో సంపత్ కుమార్.. హైదరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్ తెలిపారు. మరో కేసులో మహ్మద్ ఇర్ఫాన్, షేక్ కమాల్ అనే ఇద్దరిని అరెస్టు చేసి రెండు లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రెండు కేసుల్లో పట్టుకున్న హాష్ ఆయిల్ విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని