తప్పించుకోబోయి..చావును కొనితెచ్చుకొని
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పోలీసుల నుంచి
జహీరాబాద్: మహిళపై అత్యాచారం కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని కారులో పారిపోతుండగా...రాయికోడ్ మండలం సిరూర్ సమీపంలో కారు బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మహిళలే లక్ష్యంగా ఐదుగురు సభ్యులున్న ఓ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల పేరుతో ముగ్గురు నిందితులు సూర్యాపేటకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జహీరాబాద్ పస్తాపూర్ కూడలిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఈ కేసులో నిందితులను స్టేషన్కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న ఏం జరిగిందంటే?..
మేం పోలీసులం.. మీ లగేజీలో నిషేధిత ఉత్పత్తులున్నాయి.. తనిఖీ చేయాలంటూ బస్సులోంచి ప్రయాణికురాలిని దింపి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన 32 ఏళ్ల మహిళ 12 ఏళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయలుదేరింది. అందులోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళ తీసుకెళ్తున్న బస్తాల్లో నిషేధిత ఉత్పత్తులు ఉన్నాయని, జహీరాబాద్ పస్తాపూర్ చౌరస్తాలో ఆమెతో పాటు కుమారుడిని కిందకు దింపారు. సమీపంలోని స్టేట్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లి బస్తాలను తనిఖీచేసి గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరు బాలుడితో పాటు గుట్కా బస్తాల వద్ద ఉండగా, మరో వ్యక్తి.. మాట్లాడాలంటూ మహిళను బ్యాంకు వెనక పాడుబడిన కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం బాలుడు, మహిళ బ్యాంకు వద్ద నిలబడి ఉండటంతో స్థానికులు ఆరా తీసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ క్రమంలో బాధితురాలు జహీరాబాద్ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేష్ సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వివరాలను సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల చిత్రాలను గుర్తించారు. పోలీసులమని చెప్పగానే బస్సు దిగిపోవడం, రమ్మన్న చోటికి వెళ్లడంతో బాధిత మహిళ నేపథ్యాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. గుట్కా అక్రమ రవాణా చేస్తుండటంతో ఇంతకుముందే నిందితులతో ఆమెకు సంబంధాలున్నాయా.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం