6 నెలల చిన్నారిపై క్వారంటైన్‌ కేసు!

ఆరు నెలలు, మూడేళ్ల వయసున్న చిన్నారులపై క్వారంటైన్‌ అతిక్రమణ కేసు నమోదు

Published : 25 Apr 2020 00:44 IST

డెహ్రాడూన్‌: లాక్‌డౌన్‌ సమయంలో హోం క్వారంటైన్‌ నిబంధనలను అతిక్రమించినందుకు 51 మందిపై ఉత్తరాఖండ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వారిలో ఆరు నెలలు, మూడేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌  రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో చోటుచేసుకుంది. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరాదు. ఈ విషయమై విచారణకు ఆదేశాలు జారీచేశామని ఆ జిల్లా కలెక్టర్‌‌ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన జిల్లా కొవిడ్‌-19 అధికారి‌ సస్పెన్షన్‌తో సహా క్రమశిక్షణ చర్యలు చేపడతామని ఆయన వివరించారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని