మందుబాబులూ.. సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్త!
కరోనాతో విధించిన లాక్డౌన్తో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దుకాణాలన్నీ మూతపడటంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో......
ముంబయి: కరోనాతో విధించిన లాక్డౌన్తో దేశ ప్రజలంతా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైపోయారు. దుకాణాలన్నీ మూతపడటంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో మద్యం లేక అల్లాడిపోయిన మందుబాబులకు కొంత ఊరట కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా దుకాణాల వద్ద జనం కి.మీల మేర బారులు తీరడం చూశాం. అయితే, మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మద్యం హోం డెలివరీకి అక్కడి ప్రభుత్వం అనుమతించింది. దీంతో సైబర్ కేటుగాళ్లు ముంబయి నగరంలో రెచ్చిపోతున్నారు. వారి మోసాలకు బలైపోయిన కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
వల విసురుతున్నారిలా..
ముంబయిలో బాగా తెలిసిన మద్యం దుకాణాల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి ప్రజలకు వల విసురుతున్నారు. వాటిలో జత చేసిన ఫోన్ నంబర్లకు ఆర్డర్ చేయాలని కోరుతున్నారు. అయితే, చెల్లింపుల్ని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేయాలని సూచిస్తు మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఓ సినీ నిర్మాత తనకెదురైన అనుభవాన్ని వివరించారు. ‘‘ఇటీవల నేను రూ.40వేల విలువైన మద్యాన్ని జుహూలోని ఓ దుకాణం పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్న మొబైల్ నంబర్కు ఆర్డర్ చేశా. అయితే, టోకెన్ కింద రూ.5వేలు చెల్లించాలని చెప్పారు. అలాగే చేశా. ఆ తర్వాత విచారిస్తే వీళ్లంతా మోసగాళ్లని అర్థమైంది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్, బిహార్ నుంచి కొందరు ఇలా చేస్తున్నారని తెలిసింది’’ అని వివరించారు.
ఓటీపీ అడిగేసరికి అనుమానం వచ్చి..
బాగా పేరున్న ఓ మద్యం దుకాణం పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్న నంబర్కు ఫోన్ చేసి హోం డెలివరీకి ఆర్డర్ చేసినట్టు నేవీ మాజీ అధికారి ఒకరు తెలిపారు. అయితే, అ ఆర్డర్ తీసుకున్న వ్యక్తి క్రెడిట్/ డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాలని చెప్పాడనీ.. అంతేకాకుండా ఓటీపీని షేర్ చేయాలని అడిగాడన్నారు. దీంతో తనకు అనుమానం రావడంతో ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేయాలనుకున్నప్పటికీ రూ.1400 మద్యానికే ఆర్డర్ చేశానని తెలిపారు.
ఈ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశా
ఈ సైబర్ మోసాలపై ఓ మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. తన స్నేహితుల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులే కొన్ని వచ్చాయన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. కొందరు కేటుగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ వివరాలు అడుగుతున్నారనీ.. సందేహించని వారిని మోసగిస్తున్నారని.. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై సీనియర్ అధికారులతో దర్యాప్తు చేయించాలని కోరానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?