కలత చెందిన కన్న ఊరు!
రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు అది. బాహ్య ప్రపంచానికీ పెద్దగా తెలియని పల్లె ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యోగం సాధించి కలలు నెరవేరుస్తానని చెప్పి వెళ్లిన యువకుడు అగ్నిపథ్ సికింద్రాబా
కుమ్మరితండాలో రోదిస్తున్న పడ్వాల్ యోగేశ్ కుటుంబ సభ్యులు
ఉట్నూరు గ్రామీణం, న్యూస్టుడే : రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు అది. బాహ్య ప్రపంచానికీ పెద్దగా తెలియని పల్లె ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యోగం సాధించి కలలు నెరవేరుస్తానని చెప్పి వెళ్లిన యువకుడు అగ్నిపథ్ సికింద్రాబాద్ అల్లర్లతో చిక్కుకోవడంతో ఊరంతా కలత చెందుతోంది. హైదరాబాద్కు 400 కిలోమీటర్ల దూరంలోని కుమ్మరితండా ఇప్పుడు జాతీయ దర్యాప్తు దృష్టిలో పడింది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కుమ్మరితండాకు చెందిన పడ్వాల మోర్బాన్ గోదావరికి ముగ్గురు సంతానం. మోర్బాన్ లారీ డ్రైవర్గా చేస్తూ వారిని చదివించాడు. పెద్ద కుమారుడు నితేశ్ ఇంటర్ చదివి కుటుంబ పరిస్థితి బాగోలేక మధ్యలోనే ఆపేసి తండ్రితో క్లీనర్గా పని చేస్తున్నాడు. తమ్ముడు యోగేశ్ను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చూడాలని కలలు కన్నారు. కూతురు దీపిక ఇంటర్ చదువుతూ తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. యోగేశ్ ఇంటర్ పూర్తి చేసి ఆర్మీ ఉద్యోగం సాధించాలని గ్రామస్థులకు, తోటి యువతకు తెలిపాడు. స్థానికులు గ్రామంలో పోగు చేసిన డబ్బు నుంచి శిక్షణకు అవసరమైన ఖర్చుకు డబ్బులు అందించారు. దాంతో ఆయన శిక్షణ పూర్తి చేశాడు. ఆదిలాబాద్లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నాడు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఎవరికి తెలియకుండా వెళ్లాడని కుటుంబ సభ్యులు తల్లి గోదావరి, చెల్లెలు దీపిక రోధిస్తూ తెలిపారు. తన కొడుకు అలాంటి వాడు కాదని వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది. కుటుంబ సభ్యులు యోగేశ్ను కలిపించాలని అధికారులను వేడుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు