కుమార్తె ఆరోగ్యం కోసం దొంగయ్యాడు
ఎటువంటి వ్యసనాలు లేవు... అల్లరి చిల్లరగా తిరిగేవ్యక్తీ కాదు.. తాపీ పనిచేసేవాడు... కుమార్తె వైద్యం కోసం దొంగగా మారాడు. ఏడు జిల్లాల పరిధిలో 14 నెలల్లో 107 ద్విచక్ర వాహనాలు చోరీచేశాడు. కుటుంబ పరిస్థితి చూసి జాలిపడినా.. విద్యుక్త ధర్మం ప్రకారం
బైకులను పరిశీలిస్తున్న ఎస్పీ
జగ్గంపేట: ఎటువంటి వ్యసనాలు లేవు... అల్లరి చిల్లరగా తిరిగేవ్యక్తీ కాదు.. తాపీ పనిచేసేవాడు... కుమార్తె వైద్యం కోసం దొంగగా మారాడు. ఏడు జిల్లాల పరిధిలో 14 నెలల్లో 107 ద్విచక్ర వాహనాలు చోరీచేశాడు. కుటుంబ పరిస్థితి చూసి జాలిపడినా.. విద్యుక్త ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి పోలీసులది. బైకుల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ జగ్గంపేటలో ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. అయిదేళ్ల చిన్నకుమార్తెకు చెవిటి, మూగ. ఈమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించేవాడు. అమ్మాయి ఆరోగ్య ఖర్చుల కోసం ద్విచక్ర వాహన చోరీలు మొదలుపెట్టాడు. గత ఏడాది ఏప్రిల్లో కడియంలో ఓ బైక్ చోరీచేశాడు. ఇప్పటివరకు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో 107 బైక్లను తస్కరించాడు. వీటిని జగ్గంపేట మండలం గోవిందపురానికి చెందిన మంగిన వీరబాబుకు విక్రయించేవాడు. నిందితులను కోర్టులో హాజరుపర్చామని ఎస్పీ చెప్పారు. వాహనాల విలువ రూ.23 లక్షల వరకు ఉంటుందన్నారు. సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్సై టి.రఘునాథరావు, ఏఎస్సైలు నూకరాజు, సుబ్బారావు, కానిస్టేబుల్, హోంగార్డులను అభినందించి రివార్డులు అందజేశారు. ఏఎస్పీ అడ్మిన్ పి.శ్రీనివాస్, డీఎస్పీ బి.అప్పారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ