ముంచుతున్న మాయగాళ్లు!
పార్ట్టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సప్నకు మెసేజ్ వచ్చింది.పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్ నేరగాడు సందేశం పంపాడు.
రూ.14.59 లక్షలు దోచిన సైబర్ నేరగాడు
పటాన్చెరు అర్బన్: పార్ట్టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సప్నకు మెసేజ్ వచ్చింది.పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్ నేరగాడు సందేశం పంపాడు. నమ్మి అతను చెప్పిన విధంగా చేసిన ప్రైవేటు ఉద్యోగి నిలువునా మోసపోయాడు. జ్ఞానరాజు పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉంటూ.. మాదాపూర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 26న వాట్సప్లో వచ్చిన మెసేజ్ని ఓపెన్ చేశాడు. అది టెలిగ్రాంలో ఓపెన్ అయ్యింది. డబ్బు పెట్టుబడి పెడితే దానికి లాభం వస్తుందని సందేశం ఉంది. జ్ఞానరాజు తొలుత రూ.1000, తర్వాత రూ.5 వేలు పెడితే లాభం వచ్చింది. దీంతో రూ.80,000 ఒకసారి, రెండోసారి రూ.2.5 లక్షలు, ఇలా దఫదఫాలుగా రూ.6.5 లక్షలు వరకూ పెట్టాడు. అనంతరం స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరో రూ.8.09 లక్షల వరకూ పెట్టగా, పెట్టుబడి 14.59 లక్షలు అయింది. పోర్టల్లో రూ. 22.69 లక్షలు కనిపిస్తోంది. విత్డ్రా చేసుకోవాలంటే మరో రూ.3.5 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన జ్ఞానరాజు సైబర్ క్రైమ్ విభాగంతోపాటు పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రుణం అన్నాడు.. మొత్తం లాగేశాడు..
ఓ వ్యక్తి ఐదు సెకన్లలో రూ.5 లక్షల రుణం అని ఇస్తామన్న ప్రకటన చూసి మోసపోయాడు. ఈ ఘటన పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది. ముత్తంగి గ్రామానికి చెందిన పాండు ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 25న తన ఫేస్బుక్ ఓపెన్ చేయగా అందులో 5 సెకన్లలో రూ.5 లక్షల రుణం ప్రకటన చూశాడు. అందులో సూచించిన నంబర్కు ఫోన్ చేశాడు. రుణం కావాలంటే ముందు రూ.2,500 చెల్లించాలన్నారు. దస్త్రాల ఖర్చు కింద రూ.4,500, బీమా కింద రూ.18,900, బ్యాంకు సపోర్టు చేయడం లేదని రూ.32 వేలు ఒకసారి, తర్వాత రూ.32,500, 15,500, ఇలా దఫాదఫాలుగా మొత్తం రూ. 2.48 లక్షలు వేశాడు. అనంతరం అవతల వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. మోసపోయాయని గ్రహించి పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం