కారు మిగిల్చిన కన్నీటి సంద్రం
కారు నడిపే సమయంలో ఆవహించిన నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ విషాద ఘటన.. లోకం పోకడ ఎరుగని ఓ చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేసింది.
ముగ్గురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు
దొనకొండ, న్యూస్టుడే: కారు నడిపే సమయంలో ఆవహించిన నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ విషాద ఘటన.. లోకం పోకడ ఎరుగని ఓ చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేసింది. తన పైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న ఓ కుటుంబానికి ఆధారాన్ని లేకుండా చేసింది. అప్పటి వరకు శుభకార్యంలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపి ఆ జ్ఞాపకాలతో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న ఓ వృద్ధురాలిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటన దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు మండలం పులిపాడుకు చెందిన గుంటక రామలక్ష్మమ్మ(61) పెద్దారవీడు మండలం శివపురంలో బంధువుల గృహ ప్రవేశానికి వారం రోజుల క్రితం వెళ్లారు. శుక్రవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అదే గ్రామానికి చెందిన మహేంద్ర కుమారి కూడా తన ఏడాది వయసున్న పాపతో బయలుదేరింది. వీరందరినీ కారులో పులిపాడులో దింపి రావాలని బంధువైన నాగేశ్వరరెడ్డిని పురమాయించారు. అదే సమయంలో తాము కూడా కారులో సరదాగా వెళ్లి వస్తామని రామలక్ష్మమ్మ ముని మనవలైన మెట్టు సంతోష్రెడ్డి(11), పవన్ కుమార్ రెడ్డి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రుద్రసముద్రం వద్దకు రాగానే నాగేశ్వరరెడ్డి నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈ సమయంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న శెట్టినేని నరేంద్ర(27) అనే గ్రంథపాలకుడిని అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నరేంద్ర, సంతోష్రెడ్డి సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్ర గాయాలైన రామలక్ష్మమ్మను ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచారు. అదే కారులో ఉన్న పవన్ కుమార్ రెడ్డి, డ్రైవర్ నాగేశ్వరరెడ్డి, మహేంద్ర కుమారి, ఆమె ఏడాది వయసున్న పాపకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
ఆ కుటుంబాల్లో విషాదం...: దర్శి మండలంలోని పులిపాడు గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మనుమడి కుమారులైన ఇద్దరూ నాయనమ్మను వదిలిపెట్టడానికి తోడుగా వచ్చారు. మనుమడి భార్య అయిన మహేంద్ర కుమారి కూడా వారితో పాటు వెళ్లింది. వీరిలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దర్శి మండలంలోని చందలూరు గ్రామానికి చెందిన శెట్టినేని నరేంద్ర మార్కాపురం గురుకుల పాఠశాలలో గ్రంథపాలకుడిగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారును నడుపుతున్న నాగేశ్వరరెడ్డి గురువారం రాత్రి కోలాటం భజనలో పాల్గొని నిద్ర లేకుండా ఉన్నారు. ఉదయాన్నే వాహనం నడిపే సమయంలో నిద్ర ఆవహించడం ఈ ప్రమాదానికి కారణమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM