జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా

శ్రీకాకుళం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Published : 07 Jun 2023 03:41 IST

19 మందికి గాయాలు

నరసన్నపేట, న్యూస్‌టుడే: శ్రీకాకుళం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి మంగళవారం ఉదయం పాతపట్నం బయలుదేరిన బస్సు.. జాతీయ రహదారిపై కోమర్తి కూడలి వద్ద పైవంతెన మీదుగా దిగుతూ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు అక్కడికి చేరుకుని, అద్దాలను పగలకొట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని నరసన్నపేట, శ్రీకాకుళం ఆసుపత్రులకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు