ISRO Recruitment Exam: గుండీలు తీసిన బంట్లు.. ఇస్రో ఉద్యోగ పరీక్షలో మోసం
ఇస్రోలో ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్ఎస్సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అక్రమాలకు ప్రయత్నించినవారు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు.
భారీ మొత్తాలు చేతులు మారి ఉంటాయంటున్న పోలీసులు
తిరువనంతపురం: ఇస్రోలో ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్ఎస్సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అక్రమాలకు ప్రయత్నించినవారు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. తమను ఆశ్రయించిన అభ్యర్థుల కోసం ప్రత్యేక తరహాలో షర్టులు కుట్టించి, వాటి గుండీ (బటన్)లోనే ఇమిడిపోయేలా సూక్ష్మ కెమెరా లెన్సులను అమర్చడం గురించి తెలుసుకున్నాక.. దీనివెనుక భారీ మొత్తాలు చేతులు మారి ఉంటాయని వారు భావిస్తున్నారు. వీరు ఉపయోగించిన సాంకేతికతను తెలుసుకోవడంపైనే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటివి గతంలో ఏమైనా జరిగాయా అనేది తెలుసుకునేలా విచారణ కొనసాగుతుందని తిరువనంతపురం పోలీసు కమిషనర్ నాగరాజు చకిలం మంగళవారం విలేకరులకు తెలిపారు. ‘ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువుతోపాటు ఇయర్ పీస్, కెమెరా లెన్స్లు ఉపయోగించారు. ఇవి ఏ బ్రాండ్కు చెందినవి కావు. ప్రత్యేకంగా ఓ సాంకేతిక నిపుణుడి సాయంతో రూపొందించారు. దీనిలో సిమ్కార్డు కూడా పడుతుంది. నిందితులు పరీక్షకు ముందురోజు విమానంలో వచ్చారు. పక్కా ప్రణాళికతో ఉన్నారు. రెండ్రోజుల్లో మొత్తం నలుగురిని అరెస్టు చేశాం’ అని వివరించారు. ‘డబ్బులిస్తే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నిందితులు నమ్మకం కల్పించారు. ప్రశ్నపత్రాలను ఒకచోటకు ఎలక్ట్రానిక్ విధానంలో చేరవేసి, అటునుంచి చెప్పే సమాధానాలు విని రాసేందుకు తగిన ఏర్పాట్లన్నీ చేశారు. ఇలాంటి మూడు పరికరాలను స్వాధీనం చేసుకున్నాం’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. -
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోటాలో చోటుచేసుకుంది. -
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ 9’ పబ్పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ