ఆన్లైన్ గేమ్లకు కుటుంబం బలి
ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిన వ్యక్తి అందులో అప్పులపాలు కావడంతో ఏర్పడిన కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, కుమారుడికి విషమిచ్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
మూడేళ్ల కుమారుడు, భార్యకు విషమిచ్చి భర్త ఆత్మహత్య
రాజేంద్రనగర్, న్యూస్టుడే: ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిన వ్యక్తి అందులో అప్పులపాలు కావడంతో ఏర్పడిన కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, కుమారుడికి విషమిచ్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిర(38)కు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. అనంతరం ఆమె నాలుగేళ్ల క్రితం రామంతాపూర్కు చెందిన ఆనంద్(42)ను రెండో వివాహం చేసుకుంది. ఆనంద్ అప్పటికే మొదటి భార్యకు విడాకులిచ్చాడు. ఈ దంపతులు మూడేళ్లుగా బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసి నివసిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు విక్కీ ఉన్నాడు. ఇందిర ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆనంద్ కొంతకాలం పాల వ్యాపారం చేశాడు. దాన్ని మానేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అతనికి ఆన్లైన్ గేమ్లు ఆడే అలవాటు ఉండటంతో తరచూ అందులో డబ్బులు పోగొట్టుకునేవాడు.
ఈ క్రమంలో చేసిన అప్పులను తీర్చడానికి ఇందిరకు సంబంధించిన బంగారాన్ని విక్రయించడమే కాకుండా కారునూ అమ్మేశాడు. ఇటీవల ఫ్లాటును సైతం విక్రయిద్దామని ఇందిరతో అన్నాడు. ఈ విషయంలో దంపతుల మధ్య పలుమార్లు గొడవ జరిగింది. వారికి ఇందిర తల్లిదండ్రులు, బంధువులు సర్దిచెప్పారు. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో వారిని మల్కాపూర్ గ్రామానికి రావాల్సిందిగా సూచించారు. దీంతో కుటుంబం సహా అక్కడికి వెళ్లాలని దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆనంద్తో ఇందిర సోదరి ఫోన్లో మాట్లాడి గ్రామానికి రావాల్సిందిగా కోరింది. ఆమెతో వస్తున్నట్లు చెప్పిన ఆనంద్ తర్వాత తోడల్లుడికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. భార్య, కుమారుడికి కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చి అతను కూడా తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆనంద్ భార్యను ఎప్పుడూ వేధించేవాడని ఇందిర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ గేమ్ల కారణంగానే ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు ఘటనా స్థలాన్ని సందర్శించి.. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.