Medak: పండగపూట విషాదం.. కవలలు మృతి, చావుబతుకుల్లో తల్లి

మెదక్‌ జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళను ప్రమాదవశాత్తు టిప్పర్‌ ఢీ కొట్టింది.

Published : 13 Nov 2023 02:02 IST

ఆటోనగర్‌: మెదక్‌ పట్టణంలోని ఆటోనగర్‌లో పండగపూట విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళను ప్రమాదవశాత్తు టిప్పర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవలలు పృథ్వీతేజ్‌ (12), ప్రణీత్‌ తేజ్‌ (12) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి అన్నపూర్ణను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీపావళి పండగపూట టపాసులు కొనేందుకు చిన్నారులు తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ భర్త రెండేళ్ల క్రితం ప్రమాదంలో మృతి చెందారు. ఇవాళ కవల పిల్లలు సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు