Andhra News: మైనర్ల డ్రైవింగ్‌.. తెనాలిలో కారు బీభత్సం

గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ రోడ్డులో కారు అదుపు తప్పి రిక్షా మరమ్మతులు చేస్తున్న..

Updated : 06 Jul 2022 14:45 IST

తెనాలి గ్రామీణం: గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ రోడ్డులో కారు అదుపు తప్పి రిక్షా మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. మైనర్లు కారు నడపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో ఓ వ్యక్తి కాలు నుజ్జునుజ్జవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయడపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవింగ్‌ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని