Crime News: పండ్లరసం కొనిస్తానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జక్రాన్‌పల్లి మండలంలో తొమ్మిదేళ్ల బాలికపై నారాయణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి కోసం వేరే ప్రాంతం నుంచి భార్యాభర్తలు

Updated : 24 Apr 2022 13:03 IST

జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జక్రాన్‌పల్లి మండలంలో తొమ్మిదేళ్ల బాలికపై నారాయణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి కోసం వేరే ప్రాంతం నుంచి భార్యాభర్తలు కూతురితో కలిసి మూడు నెలల కిందట మండల కేంద్రానికి వలస వచ్చారు. శివారులో గుడిసె వేసుకొని జీవిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి భార్య, కూతురిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సమీప గ్రామంలోని విత్తనోత్పత్తి కేంద్రంలో కూలీగా చేస్తూ తల్లి తన కూతురితో జీవనం సాగిస్తోంది.

రోజు మాదిరిగానే శుక్రవారం కుమార్తెను ఇంట్లో వదిలేసి తల్లి పనికి వెళ్లింది. దీన్ని గమనించిన నారాయణ అనే వ్యక్తి పండ్లరసం కొనిస్తానని చెప్పి చిన్నారిని సమీపంలో కొండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లికి కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించగా చిన్నారితో సహా నిందితుడు దొరికాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్‌పల్లి సీఐ ప్రతాప్ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని