Crime News: బైక్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.

Published : 19 Feb 2024 21:29 IST

అల్లాదుర్గం: మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలంలోని బాచారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌, భీమయ్య, మాస్‌, సాయిలు.. అంధోల్‌ మండలంలోని నాధులాపుర్‌ గ్రామంలో నిశ్చితార్థం కార్యక్రమానికి బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌ గ్రామ శివారులో వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌, భీమయ్య, సాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. మాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ జాతీయ రహదారి 161పై ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని