Road Accident: ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న లారీలు.. డ్రైవర్లు మృతి

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గు లారీ, పొట్టు లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ప్రమాదంలో మరొకరికి

Updated : 20 Apr 2022 10:02 IST

జాజిరెడ్డిగూడెం: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గు లారీ, పొట్టు లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిని వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కొమ్మర శ్రీకాంత్‌, రామకృష్ణగా గుర్తించారు. జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ఈ మార్గంలో వాహనరాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని