Road Accident: రోడ్డు దాటుతున్న కుటుంబాన్ని ఢీకొన్న బైకు.. బైకర్‌ పరారీ

రోడ్డు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా వచ్చిన బైకు ఢీకొన్న ఘటన సైబరాబాద్ కమిషనరేట్

Updated : 30 Aug 2021 12:34 IST

రామచంద్రాపురం: రోడ్డు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా వచ్చిన బైకు ఢీకొన్న ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నెంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌తో ఏమరపాటుగా వచ్చిన వ్యక్తి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని