Crime News: వేటగాళ్ల విద్యుత్‌ తీగల ఉచ్చుకు ఇద్దరి బలి 

విద్యుత్‌ తీగల ఉచ్చుకు ఇద్దరు వ్యక్తులు బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది

Updated : 14 Sep 2021 17:06 IST

ములకలపల్లి: అడవి జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల ఉచ్చుకు ఇద్దరు వ్యక్తులు బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ములకలపల్లి అటవీ ప్రాంతంలో కొంతకాలంగా యథేచ్ఛగా అటవీ జంతువుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొందరు మాదారం ప్రాంతంలో విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేశారు. కాగా, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మొగరాలకుప్ప గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు వంటచెరుకు కోసం అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో పాయం జాన్‌బాబు(24), పకూరం దుర్గారావు(35)లు విద్యుత్‌ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో పాటు వెళ్లిన మిగతా ముగ్గురు అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్‌ తీగలను తొలగించారు. అనంతరం మృతదేహాలను అటవీ ప్రాంతం నుంచి ములకలపల్లి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని