Gold: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత

సుమారు 2 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అండ్‌ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

Updated : 06 Jun 2023 14:42 IST

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అండ్‌ విజిలెన్స్‌  అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణిలను తనిఖీ చేయగా.. పేస్టు రూపంలో ఆరు క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.1.05 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని