రవాణా కష్టాలు మళ్లీ మొదలు..
కాగజ్నగర్- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో మళ్లీ రవాణా కష్టాలు మొదలయ్యాయి. వంతెన నిర్మించక ముందు పడిన ఇక్కట్లు 22 ఏళ్ల తర్వాత పునరావృతం అయ్యాయి.
మరింత కుంగిన పెద్దవాగు వంతెన
కాగజ్నగర్గ్రామీణం, దహెగాం న్యూస్టుడే
అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద కుంగిన పిల్లర్
కాగజ్నగర్- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో మళ్లీ రవాణా కష్టాలు మొదలయ్యాయి. వంతెన నిర్మించక ముందు పడిన ఇక్కట్లు 22 ఏళ్ల తర్వాత పునరావృతం అయ్యాయి. పెద్దవాగు వంతెనపై పిల్లర్ మరింత కుంగడంతో సమస్య మొదటికొచ్చింది. 1999 సంవత్సరం కంటే మొదలు ఈ మార్గంలోని ఒర్రెలు, వాగులపై వంతెనలు, రోడ్డు నిర్మాణాలు లేక ఎన్నో అవస్థలు పడ్డారు. 2000 సంవత్సరంలో కాగజ్నగర్ నుంచి దహెగాం వరకు బీటీ రోడ్డు, పెద్దవాగుతో పాటు పలువాగులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలు జరిగాయి. ఫలితంగా కాగజ్నగర్ మండలంలోని జగన్నాథపూర్, జివ్వాజీగూడ, జెండాగూడ, బోడేపల్లి గ్రామాలతో పాటు దహెగాం మండలంలోని గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గత సంవత్సం ఆగస్టు మాసంలో కురిసిన భారీవర్షాల వరద కారణంగా పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించింది. ఈ కారణంగా వంతెన ఓ పిల్లరు కుంగిపోయింది. అప్పట్లో ఈ వంతెనపై నుంచి కొద్దిరోజుల పాటు వాహనాల రాకపోకలను నిషేధించి తర్వాత అనుమతించారు. ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పెద్దవాగు రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. ఫలితంగా అదే పిల్లరు మరింత కుంగిపోయింది. ఆదివారం వంతెనను పరిశీలించిన అధికారులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి రాకపోకలను నిషేధించారు. వంతెనకు అడ్డంగా యుద్ధప్రాతిపదికన వాహనాలు వెళ్లకుండా గోడలు కట్టించారు. మరోవైపు బీబ్రా- కోత్మీర్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు పెద్దవాగు వరదతో కొట్టుకుపోయింది. ఎలాంటి వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రెండు పిల్లర్ల మధ్య ఏర్పడిన ఖాళీ
రాకపోకలు నిలిపివేసిన అధికారులు
కాగజ్నగర్గ్రామీణం: కాగజ్నగర్- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో అందవెల్లి వద్ద పెద్దవాగు వంతెన మరింత ప్రమాదకర స్థితికి చేరడంతో అధికారుల బృందం ఆదివారం పరిశీలించింది. గత సంవత్సరం కురిసిన వర్షాలకు వంతెన ఓ పిల్లరు కుంగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు వరద కారణంగా ఆ పిల్లరు మరింత కుంగింది. ఈ నేపథ్యంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పలువురు అధికారులు వంతెన పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సీఐ నాగరాజు, తహసీల్దార్ ప్రమోద్కుమార్, రోడ్డు భవనాలశాఖ డీఈ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, నాయకులు చన్కపురే గణపతి, కె.రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
రాకపోకలు సాగించకుండా వంతెనపై అడ్డంగా కడుతున్న గోడ
త్వరగా మరమ్మతులు చేయాలి
- చెమ్మకారి గంగన్న, లగ్గాం, దహెగాం
పెద్దవాగు వంతెనతో పాటు రోడ్లు త్వరగా బాగు చేయాలి. పెద్దవాగు వంతెన బాగున్న రోజుల్లో దహెగాం నుంచి కాగజ్నగర్కు ప్రయాణ దూరం 30 కిలోమీటర్లు మాత్రమే. నేడు బెల్లంపల్లి మీదుగా కాగజ్నగర్కు రావాలంటే 70 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సి ఉంటుంది. ఫలితంగా వ్యయప్రయాసలు తప్పేలా లేవు. అధికారులు, పాలకులు స్పందించి రవాణా సౌకర్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?