అమ్మాయిలదే హవా
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది.
ఫిబ్రవరిలో నిర్వహించిన వార్షిక పరీక్ష రాసేందుకు వరుస క్రమంలో వెళ్తున్న విద్యార్థినులు
న్యూస్టుడే, నిర్మల్ అర్బన్: ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. రెగ్యులర్ కోర్సులకు సంబంధించి 2022-23 లో ప్రథమ సంవత్సరంలో 8వ స్థానంలో ఉండగా ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాల్లో 16వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ ఏడాదిలో గత సంవత్సరం 9వ స్థానంలో ఉండగా ఈ సారి 12కు తగ్గింది. ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం గత విద్యా సంవత్సరం 34, 30 స్థానాల్లో ఉండగా, ఈ సారి మాత్రం 27, 28 స్థానాల్లో నిలిచింది.
వరుసగా..
2022-23, ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో వరుసగా రెండు పర్యాయాలు అమ్మాయిల హవానే కొనసాగింది. 2022-23లో ప్రథమ సంవత్సరంలో 73శాతం కైవసం చేసుకోగా ఈ సారి 68.68, ద్వితీయ ఏడాదిలో గత సంవత్సరం 78, తాజాగా 76.83 శాతంతో తమ విజయఢంకాను మోగించారు. ఒకేషనల్లోనూ గత సంవత్సరం ప్రథమంలో 58, ద్వితీయ సంవత్సరంలో 77, ప్రస్తుతం వెల్లడించిన ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 62.58, ద్వితీయ సంవత్సరంలో 75.66 శాతంతో తమదైన ప్రత్యేకతను కనబర్చారు.
అత్యుత్తమంగా..
జిల్లాలో 18 కేజీబీవీలుండగా 11 కళాశాలలుగా ఉన్నతీకరించారు. ఇందులో 2023-24 సంవత్సరంలో పెంబి(మందపల్లి)లో ఎంపీసీ, బైపీసీని ప్రారంభించారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ ఉత్తీర్ణులై శతశాతం కైవసం చేసుకున్నారు. నర్సాపూర్(జి) విద్యాలయంలోని ఎంపీసీ,బైపీసీ విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 100 శాతం నమోదు చేసుకుంది. కడెం విద్యాలయంలోని సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఏడు, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూలను నాలుగు చోట్ల నిర్వహిస్తున్నారు. మొత్తంగా కేజీబీవీలు 89 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల తనిఖీల్లో నగదు పట్టివేత
[ 04-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
జిల్లా కేంద్రానికి చేరుకున్న ఓటర్ల చైతన్య యాత్ర
[ 04-05-2024]
విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి భాజపా వ్యతిరేకం అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళీ ... -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 04-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన ఇచ్చోడ మండలం సాత్ నంబర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. -
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
[ 04-05-2024]
ఉమ్మడిజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగువారాలపాటు తీర్పును సస్పెన్షన్లో పెట్టింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ఇప్పుడు హైకోర్టుతీర్పు అంతే ప్రాధాన్యతాంశంగా మారింది. -
భరోసా నింపేందుకు భారాస అధినేత రాక
[ 04-05-2024]
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గత ఏడాది నవంబరు 24న మంచిర్యాల జిల్లా నస్పూర్లో నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాలలో రోడ్షో నిర్వహించనున్నారు. -
గోదాములకు సీల్.. వ్యాపారుల గోల్మాల్
[ 04-05-2024]
రైస్ మిల్లు యజమాని లీజుకు తీసుకున్న గోదాములను బ్యాంకు అధికారులు సీజ్ చేయడంతో అందులోని ధాన్యం నిల్వల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గోదాములను అద్దెకిచ్చిన యజమాని బ్యాంకు అప్పు చెల్లించడం లేదని ఎస్బీఐ అధికారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ముందే ఓటేశారు!
[ 04-05-2024]
పోలింగ్ తేదీకి ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్ ఓటును, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. -
ఇంటర్లో అందలం.. పదిలో అధమం
[ 04-05-2024]
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ తేడా ప్రధానంగా పాఠశాల విద్యాశాఖాధికారులను నైరాశ్యంలోకి నెడుతోంది. ఇంటర్ ఫలితాల్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రంలో 4, 2, 7 స్థానాల్లో నిలవగా పది ఫలితాల్లో మాత్రం 30, 29, 31 స్థానాలకే పరిమితమైంది. -
జిల్లా జోలికొస్తే భీం స్ఫూర్తిగా పోరాడుతాం
[ 04-05-2024]
అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
అక్రమ దందా.. ఆ ఇద్దరి అండ
[ 04-05-2024]
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పీడీఎస్ బియ్యం అక్రమ దందా మూడు బస్తాలు, ఆరు వాహనాలుగా విరాజిల్లుతూ వారి జేబులు నింపుతోంది. నేతల అండదండలతో అది శ్రుతిమించుతోంది. -
నిప్పుల కొలిమి
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటివారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. -
ఫోన్ చేయండి.. కథ వినండి
[ 04-05-2024]
వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉపాధిహామీ పథకం రద్దుకు భాజపా కుట్ర: మంత్రి
[ 04-05-2024]
కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. -
ఆ రెండు గ్రామాల వారు ఓటేసేది ఇక్కడే
[ 04-05-2024]
-
‘నిర్మల్ చరిత్ర’ పుస్తక రచయిత మృతి
[ 04-05-2024]
చారిత్రక ప్రాశస్త్యమున్న నిర్మల్ విశేషాలను ‘నిర్మల్ చరిత్ర’ పేరిట పుస్తకరూపంలో తీసుకొచ్చిన రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకం రాములు (76) గురువారం రాత్రి మృతిచెందారు. -
హామీలను విస్మరించి భాజపా పాలన
[ 04-05-2024]
ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం విస్మరించి పదేళ్లు పాలన సాగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) జిల్లా సమన్వయకర్తలు ఆకునూరి మురళి, నైనాల గోవర్ధన్ అన్నారు. -
విద్యుత్తు.. కారాదు విపత్తు
[ 04-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు. -
గోస తీర్చాలి.. బాసటగా నిలవాలి
[ 04-05-2024]
పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి. -
నాయకా.. ఆరోగ్యమూ ముఖ్యమే
[ 04-05-2024]
మండుటెండల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. ప్రచారానికి మిగిలింది ఎనిమిది రోజులు మాత్రమే. -
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
సైబర్ కేసులో మరో ముగ్గురు..!
[ 04-05-2024]
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చిన కేసులో ఇదివరకే పట్టణానికి చెందిన షిండే ప్రణయ్ను సైబర్ క్రైం బ్యూరో (సీసీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!